మరో యువతితో లేచిపోయిన భార్య.. భర్తకు గుండెపోటు !

-

జనరేషన్ మారుతున్న కొద్దీ.. లోకంలో అనేక విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా తమ లైంగిక వాంఛ తీర్చుకునేందుకు అనేక మార్గాలను ఎంచుకుంటున్నారు కొంత మంది. ఇటీవలె ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకున్న సంఘటన మరువకముందే.. కేరళలో మరో వింత ఘటన చోటు చేసుకుంది. కేరళ రాష్ట్రంలోని త్రి న్సూర్ పట్టణంలో యువతి, అలాగే ఓ యువకుడికి ఈ మధ్యనే వివాహం జరిగింది. ఇరు కుటుంబాల పెద్దల… సమక్షంలోనే ఈ జంట వివాహం జరిగింది.

అయితే… పెళ్లి జరిగిన తెల్లవారే ఆ యువతి… లేచిపోయింది. విచిత్రం ఏమిటంటే.. ఆ యువతి పెళ్లి అయిన మరో మహిళతో లేచిపోవడం. పెళ్లి జరిగిన తర్వాత… భార్య, భర్తలు ఇద్దరూ స్థానికంగా ఉన్న బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకు నుంచి డబ్బులు, నగలు తీసుకున్న అనంతరం… భర్తతో ఇప్పుడే వస్తానని చెప్పి… తన ప్రియురాలి తో జంప్ అయ్యింది కొత్త పెళ్ళి కూతురు. ఈ విషయం తెలియక ఆమె భర్త స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అయితే దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న అనంతరం.. ఆ యువతిని విచారిస్తే అసలు విషయం బయట పడింది. తాము లవ్ చేసుకున్నామని… ఇంట్లో తమ తల్లిదండ్రులు ఇచ్చే బంగారం కోసమే.. మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు ఆ భార్య చెప్పింది. ఇంకేముంది ఈ విషయం తెలియగానే ఆ కొత్త పెళ్లి కొడుకుకు గుండెపోటు వచ్చింది. దీంతో అతన్ని స్థానిక ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం అడ్మిట్ చేశారు. ఇక ఈ విషయం తెలిసిన అతని కుటుంబ సభ్యులు.. ఆ యువతి పై మండి పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version