మంత్రి రోజా కుమార్తెకు అరుదైన పురస్కారం

-

నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా కూతురు అన్షు మాలికకు అరుదైన గౌరవం దక్కింది.అన్షు మాలిక రాసిన ‘ది ఫేం ఇన్ మై హార్ట్ ‘ అనే పుస్తకం జీ టౌన్ దక్షిణ భారతదేశం నుంచి ఉత్తమ ఆధార్ కేటగిరీలో ఎంపికైంది. ఈ పురస్కారాన్ని ఇటీవలే మూడు రోజుల కిందట బాలీవుడ్ నటి సాజన్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ విషయాన్ని అన్షు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.

కాగా అన్షు సినీ ఎంట్రీ పై కూడా రకరకాలుగా వార్తలు వచ్చాయి. తల్లిలాగే ఎంతో గ్లామర్ గా ఉన్న అన్షు సినీ ఎంట్రీ ఇస్తే గొప్ప హీరోయిన్ అవుతుందని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అన్షు మాలికకు ఇంస్టాగ్రామ్ లో 91 వేల మంది ఫాలోవర్లు ఉండడం విశేషం. అయితే రోజా మాత్రం ఇప్పుడే తన కూతురు సినీరంగ ప్రవేశం గురించి ఆలోచించడం లేదని తెలుస్తోంది.

సెల్వమణి – రోజా దంపతులకు అన్షు మాలిక్, కృష్ణ లోహిత్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే అన్షు తాను ఈ పురస్కారం అందుకున్నట్లు తనతో చెప్పలేదని, తాను కూడా వార్తల్లో చూసి తెలుసుకున్నానని మంత్రి రోజా పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version