యూపీలో షాకింగ్ ఘటన.. డ్యూటీలోనే కన్నుమూసిన యువ ఉద్యోగిని!

-

యూపీలోని లక్నోలో ‘ఎర్నెస్ట్ అండ్‌ యంగ్‌ ఇండియా’ కంపెనీ ఉద్యోగి ఆత్మహత్య తరహా మరో ఘటన చోటుచేసుకుంది.లక్నోలోని గోమతినగర్‌లోని స్థానిక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో అదనపు డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సదాఫ్‌ ఫాతిమా విధులు నిర్వహిస్తుండగా ఉన్నట్టుండి కుర్చీలోనే కుప్పకూలారు.గమనించిన సహచరులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు.

అయితే, ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. తీవ్ర ఒత్తిడి కారణంగా కార్డియాక్ అరెస్టుతో మరణించిందా? లేదా వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది. కాగా,మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. ఈ ఘటనపై సమాజ్ వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు.ఇది ఆందోళన కలిగించే ఘటన అని పేర్కొన్నారు.ఉద్యోగులు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఒత్తిడిపై అన్ని కంపెనీలు, ప్రభుత్వ విభాగాలు తీవ్రంగా ఆలోచించాలన్నారు.ఇది దేశ మానవ వనరులకు పూడ్చలేని నష్టమని చెప్పుకొచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version