సీఎం జగన్ కు అచ్చెన్నాయుడు లేఖ..రైతులను ఆదుకోవాలంటూ..

-

ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ఏపీలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి రూ. 4 వేల కోట్ల ప్రకృతి విపత్తుల ఏర్పాటు హామీలు ఏమయ్యాయని ఆయన నిలదీశారు. మూడేళ్లలో వర్షాలకు దాదాపు రూ. 20 వేల కోట్ల విలువైన పంట నష్టం జరిగిందని, అయితే ప్రభుత్వం ఇచ్చిన పరిహారం పది శాతం కూడా లేదని ఆయన అన్నారు.

నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని ఆయన అన్నారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇప్పటికే రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని, వారిని అకాల వర్షాలు మరిన్ని ఇబ్బందులకు గురి చేశాయని అన్నారు. మూడేళ్లుగా రాష్ట్రంలో రైతులు సంక్షోభంలో కూరుకు పోయారు అని పేర్కొన్నారు అచ్చన్నాయుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version