నటి జెత్వాని కేసు.. వైసీపీ నేత విద్యాసాగర్ రిమాండ్ పొడగింపు..!

-

ముంబయి నటి కాదంబరి జెత్వానీ కేసులో నిందితుడు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ రిమాడ్ పొడగించారు. విజయవాడ నాలుగో ఏసీఎంఎం కోర్టు ఈనెల 29 వరకు రిమాండ్ ను పొడిగించింది. ఈ కేసులో ఆయన ఏ1గా చేర్చారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీ గా ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన ముంబయి నటి జెత్వానీ ని వేధించిన కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ అరెస్టయ్యారు. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఆయనను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాదంబరి కేసు వ్యవహారం వెలుగులోకి వచ్చిన తరువాత ఆయన  అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులు ముంబైలో, మరికొన్ని రోజులు ఢిల్లీలో తలదాచుకున్నారని పోలీసులు గుర్తించారు. చివరకు డెహ్రాడూన్‌లోని ఓ రిసార్ట్‌ వద్ద అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version