కాపులు పవన్,చంద్రబాబును నమ్మవద్దు: అడపా శేషు

-

పవన్ కల్యాణ్ కి అడపా శేషు కౌంటర్ ఇచ్చారు. అడపా శేషు, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ మాట్లాడుతూ మేము మొదటి నుండి చెపుతుంది తేటతెల్లమైంది అని చెప్పారు. అలానే పవన్ వద్ద ఉన్న కాపులకు ఏమి న్యాయం జరిగిందో రేపు కూడా అదే జరుగుతుంది అని ఆయన చెప్పారు. ఎప్పుడో లోకేష్ మాట్లాడితే ఇప్పుడు పవన్ కి గుర్తుకు వచ్చింది అని అడపా శేషు అన్నారు.

కొత్త పాకెజ్ స్టార్ షర్మిల వచ్చిందని, కాబట్టి పాత ప్యాకేజీ స్టార్ పవన్ ని పక్కన పెట్టారు అని అడపా శేషు అన్నారు. కాపులను చంద్రబాబు కాళ్ళ వద్ద తాకట్టు పెట్టె ప్రయత్నం చేస్తున్నారన్నారు. అందుకే నా వద్దకు రండి అని పవన్ అంటున్నారు అని ఆయన అన్నారు. కాపులు పవన్,చంద్రబాబు ను నమ్మవద్దు అని, జగన్ ప్రభుత్వంను పడకొట్టాలని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు అని అన్నారు. జగన్ వలన జనానికి ఏమి అన్యాయం జరిగింది అని అడిగారు.

Read more RELATED
Recommended to you

Latest news