ఏపీ : జడ్పీ హైస్కూల్ లో విద్యార్థి మృతిపై మంత్రి సీరియస్..!

-

ఏపీ లోని కృష్ణాజిల్లా నందిగామ శివారు అనసాపురం జడ్పీ హైస్కూల్ ఘటనపై మంత్రి ఆదిమూలపు సురేష్ సీరియస్ అయ్యారు. పాఠశాల విద్యార్థులను పనులకు ఉపయోగించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థి విద్యుత్ షాక్ తో మృతి చెందడం బాధాకరమని మంత్రి అన్నారు. ఈ సంఘటనపై తక్షణమే ప్రాథమిక నివేదిక తెప్పించమని మంత్రి తెలిపారు. నరసాపురం ఘటనపై ఆర్ జె డి తో విచారణ జరిపిస్తామని వెల్లడించారు.

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. పాఠశాలలో పనులకు నియమించుకున్న ఆయాలను ఉపయోగించుకోవాలని మంత్రి తెలిపారు. ఎక్కడైనా విద్యార్థులతో పనులు చేస్తున్నట్లు తెలిస్తే ఉపేక్షించేది లేదని మంత్రి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సంఘటనలో మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నామని మంత్రి అన్నారు. వారి కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version