ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ అత్యంత ప్రమాదకరమైన వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని… దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

దీని ప్రభావంతో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని పేర్కొంది. ఇక ఇవాళ విశాఖపట్నం శ్రీకాకుళం మన్యం అల్లూరి, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ ఏలూరు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది.
అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి భూపాలపల్లి ఆసిఫాబాద్, ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాబోయే మూడు రోజులపాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడతాయని వెల్లడించింది.