అమరావతి దయ్యాల రాజధాని – మంత్రి అమర్నాథ్

-

ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి దేవతల రాజధాని కాదు అని.. దయ్యాల రాజధాని అని అభివర్ణించారు. చంద్రబాబు 29 గ్రామాల కోసమే ఉద్యమం చేస్తున్నారని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలలో మూడు రాజధానుల బిల్లు పెట్టే అవకాశం ఉందన్నారు. కొంతమంది పాదయాత్ర అంటున్నారని, దాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు హర్షించరని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ అభివృద్ధి చంద్రబాబు వల్లే జరిగితే తెలంగాణలో టిడిపి ఎక్కడుందని ప్రశ్నించారు మంత్రి. గాడిదకు కొమ్ములు వచ్చినా.. ముసలోడికి పిచ్చి వచ్చినా భరించడం కష్టమని అన్నారు. ఎన్టీఆర్ భవన్, అందులో ఉన్న వాచ్మెన్ తప్ప చంద్రబాబుకు అక్కడ ఎటువంటి పని లేదని విమర్శించారు. అమరావతి అనేది ఒక వివాదం.. అక్కడ పేదవాళ్లను చంపి పెద్దలకు మేలు చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఓటు, సీటు, గుర్తించే కార్యకర్తలేని డస్ట్ బిన్ లీడర్లని చంద్రబాబు పక్కన పెట్టుకున్నాడని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version