ప్రజలంతా పౌరుషం చూపారు…బాబుకు అంబటి కౌంటర్

-

వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చంద్రబాబు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు అన్ని కార్పోరేషన్లు.. మున్సిపాల్టీల్లో వైసీపీ విజయం సాధిస్తోందన్న ఆయన అర్బన్ ఓటర్లూ వైసీపీకే అనుకూలం అని తేల్చి చెప్పారని అన్నారు. చంద్రబాబు ఊరూరా తిరిగి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.. గెలుపు కోసం తాపత్రయ పడ్డారని అన్నారు. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం సాధించలేకపోయారని జగన్ కనీసం ఓటు కూడా అడగలేదని తన పాలనకు ప్రజల మద్దతు లభిస్తుందనే నమ్మకంతో జగన్ ఉన్నారు.. అది నిరూపితమైందని అన్నారు.

గతంలో ఏ అధికార పార్టీకి దక్కని అనూహ్య విజయం వైసీపీకి దక్కిందని, ఇంతటి పేలవమైన పనితీరు గతంలో ఏ ప్రతి పక్షం ప్రదర్శించలేదని అన్నారు. ఫలితాలు వస్తుంటే చంద్రబాబు లోకేష్ హైదరాబాద్ లో ఎందుకు ఉన్నారు..? అమో ప్రశ్నించారు. ప్రజలంతా పౌరుషం చూపారు.. చంద్రబాబుకే పౌరుషం లేదని అన్నారు. చంద్రబాబుకు పౌరుషం ఉంటే టీడీపీకి రాజీనామా చేయాలని అయన పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ కుటుంబానికే పౌరుషం ఉంటే చంద్రబాబు పార్టీలో ఉండే వారే కాదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version