కన్నా లక్ష్మీనారాయణపై మంత్రి అంబటి కీలక వ్యాఖ్యలు

-

మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మంత్రి అంబటి రాంబాబు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చంద్రబాబు నాయుడు సత్తెనపల్లి టీడీపీ ఇంచార్జి బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నియోజకవర్గంలో ఫుల్ యాక్టివ్ అయ్యారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబును టార్గెట్ చేశారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు మంత్రి అంబటిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీంతో మంత్రి అంబటి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు.

సత్తెనపల్లిలో రోడ్ల పరిస్థితిపై కన్నా లక్ష్మీనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి అంబటి, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ జోలె పట్టి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి రోడ్లు వేయిస్తామని కన్నా వ్యాఖ్యానించారు.దీంతో కన్నాపై మంత్రి అంబటి ఫైర్ అయ్యారు. జోలె పట్టి రోడ్డు వేయిస్తారట అని ఎద్దేవా చేశారు. అంతేకాదు కన్నా ఓ బిచ్చగాడని మంత్రి వ్యాఖ్యానించారు. బూతులు తిట్టడంలో కన్నాకు గిన్నీస్ రికార్డు ఖాయమని విమర్శించారు. కన్నా అవాకులు, చవాకులు పేలడం మానుకోవాలని సూచించారు. చంద్రబాబుతో పవన్‌కు ఎప్పటి నుంచో సంబంధాలున్నాయన్నారు. వివేకా కేసు ప్రస్తావిస్తూ లబ్ధిపొందాలని చూస్తున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version