చంద్రబాబుకు పిచ్చి హిమాలయాలకు చేరింది – అంబటి

-

చంద్రబాబుపై మరోసారి అంబటి రాంబాబు ఫైర్‌ అయ్యారు. మనిషి రక్తం మరిగిన పులికి, మనుషులు దొరక్కపోతే ఎలా పిచ్చెక్కుతుందో.. అధికారం పోయిన చంద్రబాబుకు అలానే పిచ్చి హిమాలయాలకు చేరిందని చురకలు అంటించారు. దేశంలోకెల్లా అత్యధిక డీబీటీ ద్వారా ఈ రోజుకు రూ.1.39 లక్షల కోట్లు.. కేవలం 35 నెలల్లో పేదల చేతిలో పెట్టిన ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలో ఈ గుంట నక్క చంద్రబాబుకు తెలియక.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అంబటి రాంబాబు.

విశాఖ అభివృద్ధి కావాలా? రాజధాని కావాలా అని అడిగిన చంద్రబాబును.. అమరావతి అభివృద్ధి కావాలా లేక రాజధాని కావాలా అని మేం అడుగుతున్నాం.. దానికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు? అని నిలదీశారు. చంద్రబాబు పాలనలో స్కీములు, డీబీటీలు లేవు. కింది స్థాయిలో జన్మభూమి కమిటీల దోపిడీ, పై స్థాయిలో సాగునీటి ప్రాజెక్టుల్లో, రాజధాని, ఇసుక, మద్యం పేరిట దోపిడీ జరిగాయన్నారు అంబటి రాంబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version