అమిత్ షా పిలుపు.. నలుగురు మావోయిస్టుల సరెండర్!

-

మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నలుగురు మావోయిస్టులు ఛత్తీ స్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా దళ సిబ్బంది ఎదుట సరెండర్ అయ్యారు. లొంగిపోయిన వారిలో మిడియం భీమా,సోది మున్నా అలియాస్ మనోజ్, ముచకీ దేవ, సూల ముచకీలుగా గుర్తించారు. అయితే, మిడియం భీమా తలపై దాదాపు రూ.2 లక్షల రివార్డు ఉందని అధికారులు వెల్లడించారు. అతడు మావోయిస్టు పార్టీలోని ప్లాటూన్ నంబర్- 4లో క్రియాశీల సభ్యుడిగా పనిచేసే వాడని నిర్దారణ అయ్యింది.

లొంగిపోయిన వారిలో మిగతా ముగ్గురు మావోయిస్టులు.. దిగువ కేడర్‌కు చెందిన వారని తెలుస్తోంది.‘ఛత్తీస్‌గఢ్‌లో అమాయక గిరిజనులపై మావోయిస్టులు దాడులు చేస్తుంటే చూసి బాధ కలిగింది. అవి అమానవీయ దాడులు.మావోయిస్టు సైద్ధాంతిక భావజాలం డొల్లతనంతో కూడుకుని ఉంటుంది. అందుకే మేం దానిని వదిలేసి, పోలీసులకు లొంగిపోయాం’ అని లొంగిపోయిన మావోయిస్టులు పోలీసులు ఎదుట వాంగ్మూలం ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version