బ్రేకింగ్: ఏపీ ఉపముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్…!

-

దేశంలో అన్ లాక్ 1.0 మొదలైనప్పటి నుండి కరోనా కేసులు మరింతగా పెరిగాయి. అలాగే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే… కేసులు అమాంతంగా రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం ప్రజలే కాకుండా ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారినపడి ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది ప్రజాప్రతినిధులు కరోనా బారినపడిన వారు ఉన్నారు. ఇకపోతే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి అంజాద్ భాష కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

Amjad_Basha

ఆయన గత రెండు రోజుల నుండి కడప జిల్లా పర్యటన ఉన్న నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులకు వైద్య అధికారులు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంజాద్ భాషకు కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు వైద్యులు. దీంతో వెంటనే ఆయనను హోమ్ క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు. అలాగే ఆయనకు మరోసారి వైద్యాధికారులు పరీక్షలు చేయబోతున్నారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version