విచారణ పేరుతో వచ్చి సాయిరెడ్డి డ్రామా చేశారు : సుధాకర్ బాబు

-

కేవీరావుకు, వైవీ సుబ్బారెడ్డి మధ్య సత్సంబంధాలు ఉన్నాయని విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు. నిజంగానే ఆ ఇద్దరి మధ్య సంబంధాలు ఉంటే మరి కేసు ఎందుకు వేశారు అని వైసీపి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు ప్రశ్నించారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్టును సాయిరెడ్డి చదివారు. వైసీపి ద్వారా ఎదిగిన వ్యక్తి సాయిరెడ్డి. నాయకుడు కష్టకాలంలో ఉంటే ఇలా పార్టీని వీడి వెళ్తారా.. రాజ్యసభను వదిలేసి రాజకీయ సన్యాసం ఎందుకు తీసుకున్నారు. రఘురామకృష్ణంరాజుకు సాయిరెడ్డి తన ఇంటిని ఎందుకు అద్దెకు ఇచ్చారు.

అవతలి వ్యక్తులతో సాయిరెడ్డి ఎందుకు కలిశారు. సాయిరెడ్డి పదేపదే కోటరీ అని మాట్లాడారు. సాయిరెడ్డి స్వయంగా ఎంతోమందిని మా నాయకుడికి పరిచయం చేశారు. మరి ఆయన్ని మించిన కోటరీ ఇంకేం ఉంది. సీఐడీ విచారణ అనేది ఒక బూటకం. విచారణ పేరుతో వచ్చి సాయిరెడ్డి డ్రామా చేశారు. మా నేతలు, పార్టీపై అనవసర ఆరోపణలు చేశారు. సాయిరెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేయటం ద్వారా ఎవరికి లాభం చేకూర్చినట్టు. కేసులకు, వైసీపి నేతలకు లింకు పెట్టవద్దని సాయిరెడ్డికి హితవు పలుకుతున్నాం అని సుధాకర్ బాబు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version