సిటీజన్ ఫోరమ్ ఫర్ డెమోక్రసీ.. టీడీపీ బినామీ : పేర్ని నాని

-

సిటీజన్ ఫోరమ్ ఫర్ డెమోక్రసీ.. టీడీపీ బినామీ అని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ఇది ఒక రాజకీయ ప్రేరేపిత సంస్థ.. వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇవ్వకూడదని ఈ సంస్థ కేసు వేసింది అని తెలిపారు. తాజాగా తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు.  పెన్షన్ సౌకర్యాన్ని ఆపేందుకు చంద్రబాబు కక్ష కట్టారు. ఎన్నికల వేళ.. ఈ సంస్థను స్థాపించారని మండిపడ్డారు.  నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవ్వరో అందరికీ తెలుసు. వాలంటీర్ల పై చంద్రబాబు కక్ష పెంచుకున్నారు. ఓ హోటల్ లో సుజనా చౌదరీ, కామినేని శ్రీనివాసరావును కలిసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని చెప్పారు. ఎలక్షన్ వాచ్.. కాదు అంతా పసుపు వాచ్ లే అన్నారు. 

రామోజీరావు ఎన్నికల్లో ఉన్న వారందరినీ ఒత్తిడి చెస్తున్నారా..? ఇవ్వాళ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. యధేచ్ఛగా నారా భువనేశ్వరి చెప్పులు ఇచ్చి రాజకీయ కార్యక్రమాలు చేస్తుంటే.. పిటిషన్ ఇచ్చి వారం రోజులు అయినా ఎందుకు ఆమెకు నోటీసులు ఇవ్వలేదు. ఆమె యాత్రను ఆపలేదని ప్రశ్నించారు. మరీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి తీసుకొస్తున్నారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, పురంధేశ్వరి వాలంటీర్లపై విషం చిమ్మారు. ఎవ్వరికీ వారు ఇష్టం వచ్చినట్టు విషం చిమ్మి.. ఇండ్లలోకి రానివ్వకండి వాలంటీర్లను పేర్కొన్నారు. వాలంటీర్లందరికీ రూ.50వేలు వచ్చేటట్టు చేస్తానని మాయ మాటలు చెప్పారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version