కుప్పంలో వైసీపీ జెండా ఎగురడం ఖాయం : మంత్రి పెద్దిరెడ్డి

-

కుప్పంలో వైసీపీ జెండా ఎగురడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కేఆర్జే భరత్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ దాఖలు చేసేందుకు మంత్రి పెద్ది రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పెద్ది రెడ్డి మాట్లాడుతూ.. నామినేషన్ యాత్ర విజయ యాత్రగా కనిపిస్తుందన్నారు. చంద్రబాబుకు కుప్పంలో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఈ ర్యాలీ చూశాక భరత్ కచ్చితంగా విజయం సాధిస్తారని అర్థమవుతుందని తెలిపారు.

ఎంపీగా రెడ్డప్పను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నామన్నారు. ఉమ్మడి జిల్లాకు ఎప్పుడూ వచ్చినా చంద్రబాబు తనపై విమర్శలు చేస్తున్నారని.. చంద్రబాబుకు ప్రజలెవ్వరూ చంద్రబాబును నమ్మే పరిస్థితిలో లేరన్నారు. 35 ఏళ్లుగా మనల్ని మోసం చేస్తూ.. వస్తున్న చంద్రబాబు ను నమ్మితే ఆ దేవుడు కూడా మనల్ని క్షమించండి అన్నారు. కుప్పంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version