మరో ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన పవన్ కళ్యాణ్

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్  మరో ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించారు. పిఠాపురం ఎన్నికల ప్రచారంలో బిజిబిజీగా ఉన్న సేనాని.. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీచేసే అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్‌ను నియమిస్తూ ఈ మేరకు అధికారిక ప్రకటనలో విడుదల చేశారు. పార్టీ ముఖ్యులతో వివిధ అంశాలపై నిశితంగా చర్చించిన పవన్.. వంశీ పేరును ఖరారు చేశారు. కాగా.. వంశీ కృష్ణ వైసీపీ నుంచి జనసేనలో చేరిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే కూటమికి చెందిన టీడీపీ, బీజేపీ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. మరోవైపు అధికార వైసీపీ కూడా తమ అభ్యర్థులందరినీ తొలుత ప్రకటించింది. ప్రస్తుతం కాంగ్రెస్, వామపక్షాల పార్టీలు పొత్తులతో పొత్తులతో బరిలోకి దిగుతున్నాయి. చాలా రస్తవత్తకరమైన పోటీలో ఈసారి ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో వేచి చూడాలి మరీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version