వివేకానందరెడ్డిని చంపింది ఎవరు ? : చంద్రబాబు

-

వైఎస్ వివేకా హత్యపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం వద్ద నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు చంద్రబాబు. ముఖ్యంగా  పులివెందులలో సీఎం జగన్ అబద్దాలు చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. బాబాయిని గొడ్డలి వేటు వేసి నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. వైఎస్ వివేకా హత్యను హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలను మించి పోయే విధంగా రోజుకొక కథ అల్లుతున్నారన్నారు.తొలుత సాక్షిలో గుండెపోటు అన్నారు.

ఆ తరువాత గొడ్డలి పోటు అని.. ఇలా రకరకాలుగా నాటకాలు ఆడుతున్నారని పేర్కొన్నారు.  బెంగళూరులో ఆస్తికి సంబంధించిన సెటిల్మెంట్ వైఎస్ వివేకా హత్యకు కారణం అంటున్నారని.. అంతకు ముందు వైఎస్ వివేకా రెండో వివాహం.. ఆస్తికోసం అల్లుడుతో వివాదం హత్యకు కారణమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీని, సీఎం జగన్ ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తాను కూడా సీఎం జగన్ బాధితుడినే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ వివేక హత్యను నారాసుర రక్తచరిత్ర అని నాపై నెట్టేశారు. ఆ హత్యను ఎవ్వరు చేశారో ప్రజలందరికీ తెలుసు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version