ఉగాది నుంచి ఏపీలో పీ4 విధానం అమలు..!

-

పీ4 విధానాన్ని ఉగాది పండుగ నుంచి ప్రారంభిచనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పీ4 విధానం ద్వారా సమాజంలో ఆర్థికంగా అగ్రస్థానంలో ఉన్న 10 శాతం మంది…అట్టడుగున ఉన్న 20 శాతం మందికి చేయూతనివ్వడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని సీఎం అన్నారు.. అయితే p4 విధానం పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు… దీనిపై సమగ్ర విధి విధానాలను రూపొందించేందుకు ప్రజల నుంచి సలహాలు, సూచనలు, అభిప్రాయాలను తీసుకునేందుకు ప్రత్యేకంగా పోర్టల్‌ను తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు.

పేదరిక నిర్మూలన విషయంలో ప్రజల అభిప్రాయాలు, ఆలోచనలను తీసుకుని పీ4 విధానాన్ని అమలు చేయనున్నట్లు సీఎం తెలిపారు. సచివాయంలో ప్లానింగ్ శాఖపై సమీక్ష సందర్భంగా పీ4 కార్యక్రమం ప్రారంభంపై అధికారులతో చర్చించారు. పారిశ్రామిక వేత్తలు, ఎన్ఆర్ఐలతో పాటు కొంత ఉన్నత స్ధాయిలో ఉన్నవారు పేదలకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారని….వీరందరినీ ఒక గొడుగు కిందకు తెచ్చి పీ4 విధానం అమలు చేస్తామని సీఎం చెప్పారు. ఇదే సమయంలో ప్రత్యేక సర్వే ద్వారా అట్టగుడున ఉన్న వర్గాలను గుర్తించి…వారికి సాయం అందేలా చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news