ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు శుభవార్త. సిఐడి విభాగంలో 28 హోంగార్డుల పోస్టులకు అప్లికేషన్లు తీసుకుంటున్నారు. హోంగార్డుల పోస్టులకు కాంట్రాక్టు పద్ధతిలో భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి ఏకంగా 12,569 మంది దరఖాస్తు చేసుకున్నారు. 12,569 మందిపై ప్రాథమిక పరిశీలన కొనసాగించిన అనంతరం 7,684 అప్లికేషన్లను ఫైనల్ చేశారు.

వీరికి మంగళగిరి ఏపీఎస్సీ బెటాలియన్ మైదానంలో ఈనెల ఉదయం 6 గంటల నుంచి ఫిజికల్ మెజర్మెంట్స్, సర్టిఫికెట్స్ (ఒరిజినల్స్) వెరిఫికేషన్ ప్రక్రియను కొనసాగిస్తారు. అందులో ఎంపికైన అభ్యర్థులకు రోజు రూ. 710 చొప్పున డ్యూటీ అలవెన్స్ మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో నిరుద్యోగులు సంతోషంలో ఉన్నారు.
ఎంపికైన వారు ఈనెల తొమ్మిదవ తేదీన సర్టిఫికెట్స్ తీసుకొని రావాలని స్పష్టం చేశారు. ఫిజికల్ టెస్ట్ జరిగిన తర్వాతనే ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. దీంతో ఎంపికైన వారు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విషయంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.