ఏపీ డిప్యూటీ సీఎంపై బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు

-

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై బేగంబజార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. బేగంబజార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మల్లు రవి బేగంబజార్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు నారాయణ స్వామి పై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

సోనియాగాంధీ, చంద్రబాబు కలిసి రాజశేఖర్ రెడ్డిని హెలికాప్టర్ ప్రమాదంలో చంపారని రాష్ట్ర ప్రజల్లో సందేహం ఉందని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఇటీవలే సంచలన వ్యాక్యలు చేశారు. ఆ సందేహాన్ని తీర్చే శక్తి.. సోనియాగాంధీకి, చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబుకు రాజకీయ బిక్ష పెట్టింది కూడా రాజశేఖర్ రెడ్డినే అని పేర్కొన్నారు. అలాగే ఏ తప్పు చేయని వ్యక్తి వై.ఎస్.జగన్ ను 16 నెలలు జైలులో పెట్టారని ఇటీవల నారాయణ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version