ఏపీలో దారుణం..భర్త మర్మాంగాలను కోసిన రెండవ భార్య !

-

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దారుణం చోటు చేసుకుంది. తన మొదటి భార్య ఇన్‌ స్టాగ్రామ్‌ రీల్స్ చూస్తున్నాడని భర్త మర్మాంగాలను కోసింది రెండవ భార్య. నందిగామ లోని అయ్యప్ప నగర్ లో ఈ ఘటన జరిగింది. ముప్పాళ్ళ గ్రామానికి చెందిన కోట ఆనంద్ బాబు…మొదట పెళ్లి చేసుకుని భార్యను వదిలేశాడు. ఇక గత ఐదేళ్ల క్రితం వరమ్మ అనే మరో మహిళను రెండవ పెళ్ళి చేసుకుని.. ముప్పాళ్ళ లో నివాసం ఉంటూన్నాడు.

అయితే..గత రాత్రి ఆనంద్ బాబు తన మొదటి భార్య ఇన్‌ స్టాగ్రామ్‌ వీడియోలు చూస్తుండటంతో… తనను పెళ్లి చేసుకుని ఆమె వీడియో ఎందుకు చూస్తున్నావని ఆనంద్ బాబు ప్రశ్నించింది రెండో భార్య వరమ్మ. దీంతో ఇరువురు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ తరుణంలోనే.. బ్లేడ్‌ తో భర్త ఆనంద్ బాబు మర్మాంగాలను కోసింది రెండవ భార్య వరమ్మ. తీవ్ర రక్తస్రావం కావడంతో నందిగామ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి అతనికి చికిత్స అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version