తిరుమల భక్తులకు షాక్.. ఆర్జిత సేవలు రద్దు

-

తిరుమల వెళ్లే భక్తులకు షాక్ ఇచ్చింది. ఆర్జిత సేవలు రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ పాలక మండలి. తిరుమలలో ఇవాళ నిర్వహించవలసిన కార్తీక వనభోజన కార్యక్రమాన్ని రద్దు చేసిన టీటీడీ.. వర్షం కారణంగా పార్వేటి మండపం వద్ద నిర్వహించవలసిన కార్యక్రమాన్ని రద్దు చేసింది. దీంతో వైభవోత్సవ మండపంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు అర్చకులు.

అలాగే, ఇవాళ శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ పాలక మండలి. ఇది ఇలా ఉండగా, తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు భక్తులు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 40 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న శ్రీవారిని 73,323 మంది భక్తులు దర్శించుకున్నారు. 41,041 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న హుండీ ఆదాయం రూ.3.2 కోట్లుగా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version