అచ్యుతాపురం సెజ్ ఘటన.. మృతులకు రూ.కోటి పరిహారం ప్రకటన

-

అచ్యుతాపురం సెజ్ లోని ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి 17 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దిగ్భ్రాంతికర ఘటనలో గాయపడిన బాధితులను ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో పరామర్శించారు. ప్రమాదంలో  మృతి చెందిన 17 మందికి రూ.1 కోటి నష్ట పరిహారాన్ని వారి కుటుంబ సభ్యులకు ఈరోజే అందజేయనున్నారు. అలాగే ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన 10 మందికి రూ.50 లక్షల నష్ట పరిహారాన్ని, స్వల్ప గాయలైన 26 మందికి రూ.25 లక్షల నష్ట పరిహారాన్ని ఇవ్వనున్నట్టు  ప్రకటించారు సీఎం చంద్రబాబు.

అలాగే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారందరికీ వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.  అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా ప్రభుత్వం తరుపున చేయిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.కేజీహెచ్ ఆసుపత్రిలో ప్రతీ బాధితుడి వద్దకు స్వయంగా  సీఎం చంద్రబాబు నాయుడు వెళ్ళి పలకరించి, ఓదార్చారు. వారిలో ధైర్యాన్ని నింపారు. ఎంత ఖర్చు అయినా సరే బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version