ప్రపంచంలోని హిందువులంతా కోపంతో రగిలిపోతున్నారు : సీఎం చంద్రబాబు

-

ప్రపంచంలోని హిందువులంతా కోపంతో రగిలిపోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తాజాగా ఉండవల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల లడ్డూ వివాదం గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. వైసీపీ నేతల ఒక్కొక్కరి మాటలు వింటుంటే కడుపు రగిలిపోతుంది. ప్రపంచంలోని హిందువులంతా  కోపంతో రగిలిపోతున్నారు. ఇలాంటి పనులు చేసేందుకు మీకు ఎన్ని గట్స్ ఉండాలి. వేంకటేశ్వర స్వామి వారి అపచారం చేసి ఎదురుదాడి చేస్తారా..? వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.

అపచారం చేసి పచ్చాతాపం పడని మిమ్మల్ని ఏమనాలి..? తప్పు చేసి కూడా మళ్లీ లేఖలు రాస్తున్నారు. అన్యమతస్తులు కొండపై వ్యాపారాలు చేశారు. చరిత్రలో ఎప్పుడూ క్షమించరాని నేరాలు చేశారు. రివర్సంగ్ టెండర్లతో విన్యాసాలు చేశారు. రాజకీయ ముసుగులో మోసం చేయడానికి వచ్చారు.  కల్తీ పరీక్ష కోసం ఎలాంటి ప్రత్యేక  పరీక్ష లేదు అన్నారు. పవిత్ర క్షేత్రంలో అపవిత్ర కార్యక్రమాలు చేశారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version