దేవుడ్ని అడ్డం పెట్టుకొని జగన్ పై కక్ష తీర్చుకోవద్దు : అంబటి రాంబాబు

-

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు,తెలుగు ప్రజల మధ్య తిరుమల లడ్డుపై చర్చ జరుగుతుంది అని అంబటి రాంబాబు అన్నారు. అయితే రాజకీయ కక్షతో చంద్రబాబు ఈ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. జగన్ ను రాజకీయం గా అభాసు పాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ కుట్ర లో భాగమే లడ్డుపై చేస్తున్న వివాదం. లడ్డు తయారిలో జంతువుల కొవ్వు లు ఉన్నాయని చెప్పడం దుర్మార్గం. ఇవి టీడీపీ నాయకుల అనుమానం మాత్రమే. లడ్డులో గాని నెయ్యిలో గాని కల్తీ జరిగితే, అది నిరూపణ అయితే, చర్యలు తీసుకోవచ్చు అని పేర్కొన్నారు.

అలాగే రెండు నెలల క్రితం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన సమాచారం మీరు ఎందుకు బయట పెట్టలేదు. డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. టెస్టు లకు పంపించిన మూడు నెయ్యి కంటైనర్ లు ఎవరి హయాంలో వచ్చాయి. చంద్రబాబు, జగన్ ప్రభుత్వాలలో గతంలో కల్తీ ఉందని అనుమానంతో అనేక సార్లు కొన్ని నెయ్యి కంటైనర్ లను రిజక్ట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు కోట్ల మంది లడ్డు ప్రసాదం స్వీకరించారు. ఇప్పుడు చంద్రబాబు వచ్చి జంతు కొవ్వు అని చెప్పి భక్తుల మనోభావాల తో ఆడుకుంటున్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీవారి ఆలయంలో ప్రమాణం చేసి చెప్పాలి. దేవుడ్ని అడ్డం పెట్టుకొని జగన్ పై కక్ష తీర్చుకోవద్దు అని అంబటి రాంబాబు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version