ఏపీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్ అయింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 24న ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభమవుతాయి.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/06/Jagan-takes-on-Chandrababu-in-AP-Assembly.jpg)
అదే రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండనుంది. ఈ సమావేశాలను సుమారు 20 పని దినాలు నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే దీనిపై BACలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.