రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం

-

ఏపీలోని కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. ఆదివారం రాత్రి 9.30 గంటల నుంచి 11 గంటల వరకు ఈ కల్యాణ తంతు జరగనుంది. ఈ నెల 18వ తేదీన స్వామి, అమ్మవార్లను పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలుగా అలంకరించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. 19వ తేదీన కల్యాణం, 20వ తేదీన అరుంధతి నక్షత్ర దర్శనం, రావణ బ్రహ్మ వాహన సేవ, 21వ తేదీ న పండిత సదస్యం, పొన్న వాహన సేవ, 22వ తేదీన వనవిహారోత్సవం, రథోత్సవం జరగనున్నట్లు వెల్లడించారు.

ఈ ఏడాది రథోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇందుకోసం 34.1 అడుగుల ఎత్తుతో భారీ రథాన్ని రూ.1.08 కోట్లతో తయారు చేయించినట్లు చెప్పారు. 22వ తేదీన సాయంత్రం 5 గంటలకు రథోత్సవం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. 23వ తేదీన శ్రీ చక్రస్నానం, 24వ తేదీన శ్రీపుష్పయాగం తదితర కార్యక్రమాలతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని ఈవో కె. రామచంద్రమోహన్‌ వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version