మాజీ ఎంపీ నందిగం సురేష్ పై మరో కేసు !

-

బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ పై మరో ఫిర్యాదు అందింది. మాజీ ఎంపీ నందిగం సురేష్ అతని అనుచరులు, ఆశిక్ సన్నీ , నుండి, తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎస్కే రెహమాన్ అనే వ్యక్తి.

Another complaint was received against former Bapatla MP Nandigam Suresh

ఇసుక రీచ్ ల వ్యాపారంలో, తాను డబ్బులు అప్పుగా ఇచ్చానని, తిరిగి ఇమ్మంటే చంపుతామని బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు రహమాన్. నందిగం సురేష్ అతని అనుచరుల వేధింపులతో , తన సోదరుడు ఆత్మహత్యాయత్నం కూడా చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు రెహమాన్. దీంతో ఎస్కే రెహమాన్ అనే వ్యక్తి…ఫిర్యాదు మేరకు బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ పై మరో కేసు పెట్టారని సమాచారం. కాగా..ఇటీవలే బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ జైలు కు వెళ్లిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version