ఈ నెల 18న ఏపీ కేబినేట్‌ సమావేశం..మందుబాబులకు ఇక జాతరే !

-

ఈ నెల 18న ఏపీ కేబినేట్‌ సమావేశం జరుగనుంది. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 18వ తేదీన ఏపీ కెబినెట్ భేటీ ఉంటుందని అధికారిక ప్రకటన వచ్చింది. వరద నష్టం, బుడమేరు పటిష్టత, ఆపరేషన్ బుడమేరు, సీఆర్డీఏ పరిధిలో నిర్మాణాలు, కొత్త మద్యం పాలసీ వంటి అంశాలపై ఈ కేబినేట్‌ లో చర్చ జరుగనుంది.

AP cabinet meeting on 18th of this month

ఇక కొత్త మద్యం పాలసీ ఈ కేబినేట్‌ లో నిర్ణయం తీసుకుంటే… ఏపీలో మద్యం ధరలు చాలా వరకు తగ్గుతాయని అంటున్నారు. నాణ్యమైన మద్యం కూడా వస్తుందని చెబుతున్నారు. ఇక అటు విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటన కొనసాగుతోంది. టూవీలర్ మీద పర్యటించి వరద పరిస్థితులపై టూ వీలర్ పై వెళ్లి ఆరా తీసున్నారు మంత్రి నారాయణ.  ఒక వైపు మోటార్ల తో పంపింగ్.. మరో వైపు రోడ్లకు గండ్లు కొట్టి నీటిని బయటికి పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version