కొలువుదీరిన ఏపీ కేబినెట్​.. మంత్రులుగా ప్రమాణం చేసింది వీరే

-

ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి. అనంతరం మంత్రులతో గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. చంద్రబాబు అనంతరం పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ప్రమాణం చేశారు.

ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, జేపీ నడ్డా, నితిన్‌ గడ్కరీ, రామ్మోహన్‌నాయుడు, చిరాగ్‌ పాసవాన్‌తో పాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు జాతీయ నాయకులు హాజరయ్యారు. సినీ ప్రముఖులు చిరంజీవి, రజనీకాంత్‌ దంపతులు, రామ్‌చరణ్‌ తదితరులు వచ్చారు.

ఏపీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసింది వీరే.. 

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం

ఏపీ మంత్రులుగా పవన్‌కల్యాణ్‌, నారా లోకేష్‌ ప్రమాణస్వీకారం

అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర ప్రమాణస్వీకారం

నాదెండ్ల మనోహర్‌, పి.నారాయణ ప్రమాణస్వీకారం

అనిత, సత్యకుమార్‌ యాదవ్‌ ప్రమాణస్వీకారం

నిమ్మల రామానాయుడు, ఎన్‌ఎండీ ఫరూక్‌ ప్రమాణస్వీకారం

ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్‌ ప్రమాణస్వీకారం

అనగాని సత్యప్రసాద్‌, కొలుసు పార్థసారథి ప్రమాణస్వీకారం

డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్‌ ప్రమాణస్వీకారం

కందుల దుర్గేష్‌, గుమ్మడి సంధ్యారాణి ప్రమాణస్వీకారం

బీసీ జనార్దన రెడ్డి, టి.జి.భరత్‌ ప్రమాణస్వీకారం

ఎస్‌.సవిత, వాసంశెట్టి సుభాష్‌ ప్రమాణస్వీకారం

కొండపల్లి శ్రీనివాస్‌, రామ్‌ప్రసాద్‌ రెడ్డి ప్రమాణస్వీకారం

Read more RELATED
Recommended to you

Exit mobile version