సంక్రాంతి సంబరాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సందడి చేశారు. నారావారిపల్లె సంక్రాంతి సంబరాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు నారా భువనేశ్వరి.

గెలుపొందిన మహిళలకు, పిల్లలకు బహుమతులు ప్రధానం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి దంపతులు. ఇక ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి, నందమూరి రామకృష్ణ, నందమూరి వసుంధర, దేవాన్ష్ పాల్గొన్నారు.