BREAKING NEWS : క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ కీలక సమావేశం… ఉద్యోగులపై చర్యలకు సిద్ధం..!

-

పీఆర్సీ వ్యవహారం, ఉద్యోగులు సమ్మెపై క్యాంప్ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. సీఎంతో పాటు మంత్రులు బుగ్గన, బొత్స, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల కూడా హాజరయ్యారు. ప్రభుత్వ సీఎస్ సమీర్ శర్మ కూడా సమావేశానికి హాజరయ్యారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్తున్న క్రమంలో తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించే అవకాశం ఉంది. ఉద్యోగులు పీఆర్సీ, హెచ్ ఆర్ పై సమీక్షిస్తున్నట్లుగా సమాచారం. ఉద్యోగులు చేపట్టిన పెన్ డౌన్, యాప్స్ డౌన్ పై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. సోమవారం నుంచి ఉద్యోగులు సమ్మెకు వెళ్తున్న క్రమంలో ఉద్యోగులపై ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై సమీక్షించే అవకాశం ఉంది. పాలన స్తంభిస్తే ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలనే దానిపై సమాలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే ఉద్యోగులపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఉద్యోగులకు ఇప్పటికే ప్రభుత్వ సలహదారు సజ్జల సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version