లడ్డూల్లో కల్తీ నెయ్యి వివియోగం ఘటనతో అలెర్టైన ఏపీ దేవదాయ శాఖ..!

-

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి లడ్డు పై పెద్ద చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే శ్రీవారి లడ్డూల్లో కల్తీ నెయ్యి వివియోగం ఘటనతో ఏపీ దేవదాయ శాఖ అలర్ట్ అయ్యింది. ఏపీ దేవాలయాల్లో వినియోగించే ఆవు నెయ్యి నాణ్యత వివరాలనూ సేకరించే పనిలో పడింది దేవదాయ శాఖ. ప్రముఖ దేవాలయాల్లో చేసే ఆవు నెయ్యి కొనుగోళ్లపై ఆరా తీస్తుంది. ఆవు నెయ్యిని ఏయే కంపెనీల నుంచి కొనుగోళ్లు చేస్తున్నారు..? ధరల వివరాలపై సమాచారం సేకరిస్తున్నారు దేవదాయ శాఖ ఉన్నతాధికారులు.

అయితే ప్రముఖ దేవాలయాల్లో వినియోగించే ఆవు నెయ్యిని విజయ, విశాఖ వంటి డెయిరీల్లోనే కొనుగోలు చేస్తున్నట్టు వెల్లడిస్తున్నారు. ప్రముఖ దేవాలయాల్లో వినియోగించే ఆవు నెయ్యి కొనుగోళ్లల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విధి విధానాలను ఖరారు చేసే యోచనలో ఉంది దేవదాయ శాఖ. గత ప్రభుత్వం హయాంలో టీటీడీ లో జరిగిన తప్పిదాలు.. మిగిలిన దేవాలయాల్లో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు దేవదాయ శాఖ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version