శాప్ చైర్మన్, రవి నాయుడు మాజీ మంత్రి రోజా పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ రోజాను అరెస్ట్ చేయడానికి దమ్ము అవసరం లేదని.. వారెంట్ ఉంటే చాలు అని తెలిపారు. రోజా అవినీతి పై పూర్తి స్థాయి విచారణ జరుగుతోంది. రోజా జైలుకు వెళ్లడం గ్యారెంటీ.. నిరుపేదల క్రీడాకారులకు చెందిన 119 కోట్లను రోజా దోచేశారు. రోజా నోటి దూల వల్లే వైసీపీకి 11 సీట్లు వచ్చాయి.
చంద్రబాబు ను ఏకవచనంతో మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు. చెన్నై లో తిరిగే రోజాకు ఏపీలో జరిగే అభివృద్ధి, సంక్షేమం గురించి ఏం తెలుస్తుంది. తిరుపతిలో వైసీపీ నేతలు పగటివేషగాళ్లలా తయారయ్యారు. విద్యుత్ ఛార్జీలను పెంచలేదన్న విషయం భూమున అభినయరెడ్డికి తెలియకపోవడం విడ్డూరం. విద్యుత్ ఛార్జీలపై బహిరంగ చర్చకు అభినయరెడ్డి సిద్దమా..? భూమున అభినయరెడ్డికి కనీస పరిజ్ఞానం కూడా లేదు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో అసలు పాత్రదారి భూమన అభినయరెడ్డి అని విమర్శించారు.