ఏపీ టూరిజం ఎండీగా ఆమ్రపాలి..!

-

తెలంగాణ నుంచి ఇటీవల ఏపీకి బదిలీ అయిన ఐఏఎస్ అధికారులకు ఏపీ ప్రభుత్వం  కీలక బాధ్యతలు అప్పగించింది. ఏపీ టూరిజం ఎండీగా ఆమ్రపాలికి పోస్టింగ్ ఇచ్చారు. అంతేకాదు.. కార్మికశాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్, వైద్యారోగ్య శాఖ కమిషనర్గా వాకాణి కరుణకు బాధ్యతలు అప్పగించారు.  డీఓపీటీ  ఆదేశాల మేరకు ఇటీవలే ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారులు రిపోర్టు చేశారు.


రాష్ట్ర సీసీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కి ఆమ్రపాలి, రొనాల్డ్ రోస్ , వాకాటి కరుణ , వాణిప్రసాద్  రిపోర్టు చేశారు. మరోవైపు ఏపీ నుంచి రిలీవ్ అయిన ముగ్గురు ఐఏఎస్ అధికారులు తెలంగాణ సీఎస్
శాంతికుమారికి రిపోర్ట్ చేశారు. అంతకుముందు ఏపీకి వెళ్లేందుకు నలుగురు అధికారులూ నిరాకరించారు. తెలంగాణలోనే కొనసాగేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. చివరకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ఏపీలో రిపోర్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version