ఏపీ ప్రజలకు అలర్ట్‌..మరో 2 రోజుల వర్షాలు..పిడుగులు పడే ఛాన్స్‌

-

ఏపీ ప్రజలకు అలర్ట్‌. ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తేలికపాటి నుంచి ఓ మోస్తారు… అక్కడక్కడ భారీ వానలకు అవకాశం ఉంది అంటున్నారు. విదర్భ నుంచి తమిళనాడు వరకు తెలంగాణ, కర్ణాటక మీదుగా ద్రోని కొనసాగుతుందని విపత్తుల సంస్థ ఎండి బిఆర్ అంబేద్కర్ తెలిపారు.

ఈ ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజులు పిడుగులతో కూడి అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, తెలంగాణలో రానున్న ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి అదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, బొంబాయి, గద్వాల జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version