తిరుమల ప్రసాదంపై షర్మిల సంచలన పోస్ట్‌ !

-

తిరుమల ప్రసాదంపై APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. సంచలన పోస్ట్‌ పెట్టారు. తిరుమలను అపవిత్రం చేస్తూ,హిందువుల మనోభావాలను, దెబ్బతీసేలా… టీడీపీ,వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహించారు. సిఎం హోదాలో లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ… చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్టకు భగం కలిగించేలా ఉన్నాయని మండిపడ్డారు.


కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం వేంకటేశుడికే మచ్చ తెచ్చేలా ఉన్నాయని… చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. మీ ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే.. సెంటిమెంట్ మీద రాజకీయం చేసే ఉద్దేశ్యమే మీకు లేకుంటే..నెయ్యికి బదులు జంతువుల నూనెలు నిజంగా వాడి ఉంటే… తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయండని డిమాండ్‌ చేశారు APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. లేదా CBI తో విచారణ జరిపించండని.. మహా పాపానికి,ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చండని ఆగ్రహించారు APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version