మంత్రి సీతక్కతో ఆకునూరి మురళి మర్యాదపూర్వక భేటీ..

-

తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్‌గా నూతనంగా నియమితులైన రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ప్రజాభవన్‌లో మంత్రి సీతక్కను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీతక్క ఆకునూరి మురళికి శాలువా కప్పి అభినందించారు.అనంతరం వారిరువురు తెలంగాణలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యల పై చర్చించారు. రాష్ట్రంలో ప్రీ ప్రైమరీ నుంచి సాంకేతిక విద్య, యూనివర్శిటీ స్థాయి వరకూ నూతన విద్యా విధానాన్ని రూపొందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కొత్తగా విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్‌గా సీఎం రేవంత్ రెడ్డి నియమించారు.విద్యారంగంపై ఆయనకు అపార అనుభవం ఉంది. ఆకునూరి మురళిని విద్యా కమిషన్ చైర్మన్‌గా నియమించటంతో తెలంగాణ విద్యావ్యవస్థ‌లో సమగ్ర మార్పులు వచ్చే అవకాశం ఉందని తెలంగాణ సమాజం ఆకాంక్షిస్తోంది. గతంలో ఈయన ఏపీ ప్రభుత్వానికి విద్యావ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకోని రావాలో సూచనలు, సలహాలు ఇచ్చిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version