చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం జరిగింది. నారాయణపురంలో అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేసాడు వడ్డీ వ్యాపారి. మునికన్నప్ప వద్ద రూ.80 వేలు అప్పు చేసాడు శిరీష భర్త తిమ్మరాయప్ప. అయితే ఆ అప్పు తీర్చలేక భార్య, బిడ్డలను వదిలేసి వెళ్లాడు తిమ్మరాయప్ప. దీంతో అప్పు తీర్చాలంటూ శిరీషకు వేధింపులు మొదలయ్యాయి.

కూలీ పని చేస్తూ అప్పు కడుతోంది శిరీష. ఇక టైమ్ కి డబ్బులు చెల్లించడం లేదని శిరీషను బూతులతో దూషిస్తూ చెట్టుకు కట్టేసాడు వడ్డీ వ్యాపారి. ఇక ఈ ఘటనపై వెంటనే స్పందించి మునికన్నప్పను అరెస్టు చేశారు పోలీసులు. మునికన్నప్ప టీడీపీ కార్యకర్త అని అంటున్నారు. ఈడ్చుకొంటూ వెళ్ళి తాడుతో బలవంతంగా వేప చెట్టుకు శిరీషను కట్టేసిన కొట్టాడని టీడీపీ కార్యకర్త మునికన్నప్పపై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.
80 వేలు అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు తాళ్లతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన టీడీపీ కార్యకర్త
సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో దారుణం
చిత్తూరు జిల్లా – కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో వెలుగుచూసిన దారుణం
నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష వయస్సు (25)
భర్త తిమ్మరాయప్ప… https://t.co/f0u0T890LT pic.twitter.com/qv0CpPIBnP— Telugu Scribe (@TeluguScribe) June 17, 2025