లైవ్లో యాంకర్ న్యూస్ చదువుతుండగానే.. టీవీ స్టూడియోపై బాంబు పడింది. ఇరాన్-ఇజ్రాయెల్ పరస్పర దాడుల తరుణంలో.. తాజాగా ఇరాన్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురుసుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. లైవ్ ప్రసారం నడుస్తున్న సమయంలో బాంబు పడి.. స్టూడియో ధ్వంసమైంది.

దింతో ప్రాణభయంతో పరుగు లంకించింది యాంకర్. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఇరాన్ – ఇజ్రాయిల్ మధ్య యుద్ధ పరిస్థితులు మరింతగా పెరుగుతున్నాయి. తాము ఇజ్రాయిల్ కు వ్యతిరేకంగా ఇరాన్ బలగాలతో కలిసి పని చేస్తున్నట్లుగా యెమెన్ మిలిటరీ ప్రకటించింది. గత 24 గంటలలో ఇజ్రాయిల్ పై రెండు హైపర్ సోనిక్ బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించామని వెల్లడించారు. ఇరాన్ ఆర్మీతో కలిసి చేసిన ఈ ఆపరేషన్ సక్సెస్ అయిందని పేర్కొన్నారు.
గాజాపై దాడులు చేస్తూ ఇజ్రాయిల్ అన్యాయం చేస్తుందని యెమెన్ మండిపడింది. కాగా, ఈ రెండు దేశాల మధ్య యుద్ద తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ఇరాన్ – ఇజ్రాయిల్ నుంచి భారతదేశం కొన్ని రకాల వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. యుద్ధ తీవ్రత విపరీతంగా కొనసాగుతున్న కారణంగా ఈ వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయని ఎక్స్పర్ట్స్ అంచనాలు వేస్తున్నారు.
లైవ్లో యాంకర్ న్యూస్ చదువుతుండగానే.. టీవీ స్టూడియోపై బాంబు
ఇరాన్-ఇజ్రాయెల్ పరస్పర దాడుల తరుణంలో.. తాజాగా ఇరాన్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం
ఈ నేపథ్యంలోనే.. లైవ్ ప్రసారం నడుస్తున్న సమయంలో బాంబు పడి.. ధ్వంసమైన స్టూడియో
ప్రాణభయంతో పరుగు లంకించిన యాంకర్.. సోషల్ మీడియాలో వైరలవుతున్న… pic.twitter.com/v0YFu5kUeu
— PulseNewsBreaking (@pulsenewsbreak) June 16, 2025