జనసేన పార్టీలోకి వెళ్లడంపై బాలినేని సంచలన ప్రకటన

-

నేను ఎక్కడికి పారిపోలేదు..వచ్చే ఎన్నికల్లో పోటీపై బాలినేని శ్రీనివాస్‌ సంచలన ప్రకటన చేశారు. నేను ఎక్కడికి పారిపోను.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తా..అవినీతి జరిగితే ప్రజాపోరాటం చేస్తానని వెల్లడించారు. ఇటీవలి ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఫలితాలు వచ్చాయి…గత 25 ఏళ్లలో నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎవరిని ఇబ్బంది పెట్టలేదన్నారు. ఎన్నికలకు ముందు నేను ఇవే నా చివరి ఎన్నికలు అని ముందే చెప్పాను.

balineni srinivas in to janasena party

ఎవరి ఆలోచన ఏంటో ప్రజలు నన్ను గెలిపించలేదని పేర్కొన్నారు. నేను అధికారంలో ఉన్నప్పుడు కూడా నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళను కూడా ఏమీ అనలేదు..ఫలితాల అనంతరం మా కార్యకర్తల మీద కేసులు పెట్టడం, దాడులు చేయటం చేశారని తెలిపారు. గతంలో మేము ఇలానే చేస్తే మీ పరిస్థితి ఎలా ఉండేదని తెలిపారు. రాజకీయాలు నేను వద్దనుకున్న సమయంలో మా కార్యకర్తలపై దాడులు చేసి నన్ను తిరిగి తీసుకువచ్చి రాజకీయం మీరే చేయిస్తున్నారు…నేను ఎక్కడకు వెళ్ళేది లేదు.. ఒంగోలు లోనే ఉంటానని చెప్పారు. నేను జనసేన లోకి వెళ్తున్నానని ప్రచారాలు చేస్తున్నారు..మీరు ఏదైనా చేయాలనుకుంటే డైరెక్ట్ గా నా మీదే చేయండి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version