రేపు విజయవాడలో బిజెవైఎం యువ సంఘర్షణ యాత్ర ముగింపు సభ

-

రేపు విజయవాడలో బిజెవైఎం యువ సంఘర్షణ యాత్ర ముగింపు బహిరంగ సభ జరగనుంది. ఈ బహిరంగ సభకు హాజరుకానున్నారు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్. ఈ నేపథ్యంలో సిద్ధార్ద హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లను పరిశీలించారు బిజెపి ఎపి అధ్యక్షుడు సోమువీర్రాజు,ఎపి సహ ఇన్ చార్జ్ సునీల్ దేయోధర్. ఈ సందర్భంగా బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. సీఎం జగన్ బటన్ మీద చెయ్యి వేసి తియ్యడం లేదని ఎద్దేవా చేశారు.

కానుకల రూపంలో ప్రజలను మభ్య పెడుతున్నారని అన్నారు సోమ వీర్రాజు. ప్రజలు కూడా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా బటన్ నొక్కుదామని చూస్తున్నారని అన్నారు. కాకినాడలో పెట్రో కెమికల్ కారిడార్ ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఎయిమ్స్ వంటి సంస్థలను కేంద్రం ఏపీకి ఇచ్చిందని.. కేంద్రం ఇచ్చిన వాటిని రాష్ట్రం ఉపయోగించుకొలేకపోతుందన్నారు. రేపు విజయవాడలో యువ సంఘర్షణ ముగింపు సభ జరుగుతుంది..పెద్ద ఎత్తున బిజెపి శ్రేణులు పాల్గొంటారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version