చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ప్రముఖులు.. ఫొటోలు వైరల్

-

ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా మరికొద్ది సేపట్లో నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో జరగనున్న ఈ కార్యక్రమానికి అతిరథమహారథులు తరలివస్తున్నారు. ఇప్పటికే టీడీపీ కార్యకర్తలు, అభిమానులు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మరోవైపు ఒక్కొక్కరుగా తరలివస్తున్న ప్రముఖుల ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఏపీ మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి సినీ నటుడు చైతన్య కృష్ణ, సుహాసిని, బాలకృష్ణ సతీమణి వసుంధర, నిర్మాత ఆది శేషగిరిరావు విచ్చేశారు. తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఈ కార్యక్రమానికి వెళ్లారు. మరోవైపు సినీ ప్రమఖులు కూడా వస్తున్నారు. చంద్రబాబు సోదరుడి తనయుడు, టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్, నటుడు శివాజీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు.

చంద్రబాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో విజయవాడ-గన్నవరం రహదారి రద్దీగా మారింది. కేసరపల్లి సభా ప్రాంగణం వద్దకు ఉదయాన్నే కూటమి కార్యకర్తలు వేలాదిగా పోటెత్తారు. అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో కనకదుర్గ వారధిపై వందలాది వాహనాలు నిలిచాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version