ఏపీలో అందరూ కలిసి బీజేపీని ఒంటరి చేయాలి – చలసాని శ్రీనివాస్

-

విజయవాడలో ఇవాళ బీజేపీని ఒంటరి చేసి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాన్ని కాపాడండి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ…బీజేపీని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో ఒంటరిని చేయాలని ఈ సమావేశం అన్నారు. ఆంధ్రప్రదేశ్ కి బీజేపీ నమ్మక ద్రోహం చేశారని.. మన ఆత్మగౌరవాన్ని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర నాయకులు ఢిల్లీ లో తాకట్టు పెట్టారని ఫైర్‌ అయ్యారు చలసాని శ్రీనివాస్.

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్‌ ను బీజేపీతో కలవ వద్దని కోరుతున్నానని… బీజేపీ విష కౌగిలి నుంచి పవన్ కళ్యాణ్ బయటకు రావాలని కోరారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రజలు అందరూ ఏకమై బీజేపీ ని ఒంటరి చేయమని కోరుతున్నానన్నారు చలసాని శ్రీనివాస్. బీజేపీ ని వచ్చే ఎన్నికలలో ఒంటరిని చేయాలని.. మోడీ ప్రభుత్వం ఏపీకి తీరని అన్యాయం చేసిందని ఫైర్‌ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే బాగుండేదని.. ఇతర రాజకీయ పార్టీలు కూడా మోడీ తో కలిసేందుకు ఆలోచించాలని కోరారు. వ్యవసాయ చట్టాలను స్టాండింగ్ కమిటీకి పంపమని అడిగామని.. విద్యుత్ ఉమ్మడి జాబితాలో ఉండగా రాష్ట్రాలను సంప్రదించకుండా చట్టం తీసుకు వచ్చారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version