BREAKING : పదో తరగతి ప్రశ్నపత్రాల్లో మార్పులు చేసిన ఏపీ

-

ఏపీ విద్యార్థులకు అలర్ట్. పదో తరగతి ప్రశ్నపత్రాల్లో  ఏపీ విద్యాశాఖ స్వల్ప మార్పులు చేసింది. మొదటి, రెండో భాషా ప్రశ్నపత్రాల్లో మార్పులు తీసుకు వచ్చింది. తెలుగు, హిందీ, ఒడియా, ఉర్దూ, కన్నడ, తమిళ ప్రశ్నపత్రాల్లో మార్పులు చేసింది.

సెకండ్‌ లాంగ్వేజ్‌ హిందీ, తెలుగు ప్రశ్న పత్రాల్లోనూ ఏపీ విద్యాశాఖ మార్పులు చేసింది. ఈ మేరకు మార్పులకు సంబంధించి బ్లూప్రింట్లను వెబ్‌సైట్‌లో పెట్టినట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వెయిటేజీతో పాటు మోడల్‌ పేపర్లను వెబ్‌సైట్‌లో పెట్టినట్లు వెల్లడించింది. సైన్స్‌ ప్రశ్నపత్రం నమూనా కూడా త్వరలోనే వెబ్‌సైట్‌లో పెడతామని పేర్కొంది. ఆంగ్లం, గణితం, సోషల్‌ స్టడీస్‌ పేపర్లలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది. విద్యార్థులంతా ఇది గమనించాలని.. పాఠశాలల యాజమాన్యం విద్యార్థులకు ఈ వ్యవహారంపై అవగాహన కల్పించాలని సూచించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version