ఇంద్ర కీలాద్రికి సీఎం చంద్రబాబు.. అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ..!

-

ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రిపై
ఉన్న కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా.. ప్రభుత్వం
తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు చంద్రబాబు దంపతులు. చంద్ర సతీమణి భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్ లు అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించిన అనంతరం దర్శనం చేసుకున్నారు.

సీఎం బేెజవాడ కనకదుర్గా ఆలయానికి వచ్చినప్పటికీ.. సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దర్శన ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. సీఎం చంద్రబాబు హిందూ సాంప్రదాయ ప్రకారం.. రుమాల్ కట్టుకొని దుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలను సమర్పించారు. అంతకు ముందు ఆయనకు ఆలయం వద్ద ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం చేసుకున్న తరువాత తీర్థ, ప్రసాదాలను స్వీకరించారు చంద్రబాబు కుటుంబ సభ్యులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version