ఉగాది వేడుకల్లో సీఎం జగన్, భారతి దంపతులు

-

CM Jagan and Bharti couple at Ugadi celebrations: ఉగాది వేడుకల్లో సతీసమేతంగా సీఎం జగన్‌ దంపతలు పాల్గొన్నారు. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో శావల్యాపురం మండలం గంటావారిపాలెం వద్ద క్యాంప్‌లోనే శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించారు. శ్రీ క్రోధి నామ సంవత్సరాది సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.

CM Jagan and Bharti couple at Ugadi celebrations

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, శ్రీమతి వైఎస్‌ భారతి దంపతులు ఉగాది వేడుకలకు హాజరయ్యారు. ఈ తరుణంలోనే.. సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులకు వేద ఆశీర్వచనం, తీర్ధ ప్రసాదాలను అందించారు వేద పండితులు.

ఇక ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నరసరావుపేట ఎంపీ అభ్యర్ధి అనిల్‌కుమార్‌ యాదవ్, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ లు తలశిల రఘురామ్, లేళ్ళ అప్పిరెడ్డి పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version