చంద్రబాబును పులితో పోల్చిన సీఎం జగన్

-

టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబును పంచతంత్రం కథలోని పులితో పోలుస్తూ సెటైర్లు వేశారు. ముసలాయన అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తూనే.. ఇటీవల ఓ జాతీయ టీవీలో చంద్రబాబు మాట్లాడిన మాటలను గుర్తు చేశారు.

” ఇది నరమాంసం తినే పులి.. ఇప్పుడు ముసలిదైపోయింది. పరిగెత్తలేక, నడవలేక, 4 తోడేళ్ల లాంటి నక్కలను తోడు తెచ్చుకుంటుంది. ఈ పులి అడవిలో 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెబుతూ.. నాలుగు నక్కలని తోడేసుకుని వాళ్లతో మనుషుల్ని చంపడం ఎలా అని ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు నేను ఎవరిని చంపి తినడం లేదని నమ్మిస్తుంది” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అనే పులి మోసం గురించి తెలిసిన వారు ఎవరు ఆయన వెంట రారని అన్నారు. ఆయన మాటలు విన్నాక బాబుకు బుద్ధి రాదని అనిపించిందన్నారు జగన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version